గొప్ప ప్రజా నాయకుడిని కోల్పోయాం
మాజీ ఎమ్మెల్యేపెద్ది సుదర్శన్ రెడ్డితో తెలంగాణ మాజం గొప్ప ప్రజా నాయకుడిని కోల్పోయిందని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. సుదర్శన్ రెడ్డి మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన గొప్ప నాయకుడు అని, ఉద్యమ స్ఫూర్తిని గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశాడన్నారు. ప్రజల కోసం, తెలంగాణ కోసం ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.