ఐటీసీ గేటు వద్ద మృతదేహంతో కుటుంబసభ్యుల ఆందోళన
లారీ ప్రమాదంలో మృతి చెందిన ఐటీసీపీఎస్పీడీ కర్మాగారం కాంట్రాక్టు కార్మికుడు గుగులోత్ శ్రీరామ్ ( Sriram ) కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కుటుంబసభ్యులు, బంధువులు శనివారం ఐటీసీ గేటు వద్ద ఆందోళనకు దిగారు. విధులు ముగించుకుని వాహనంపై ఇంటికి వస్తున్న సమయంలో ఐటీసీ సమీపంలో లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొని అక్కడికక్కడే శ్రీరామ్ మృతిచెందాడు.