పెళ్లయిన ఏడేళ్లలోపే వేధింపులవల్ల మహిళ మరణిస్తే వరకట్న హత్యే..!
వరకట్నం కోసం వేధించిన ఆధారాలు ఉండి, వివాహమైన ఏడేళ్లలోపే మహిళ మరణిస్తే ఆమె వరకట్న హత్య కు గురైనట్లుగానే పరిగణించవచ్చని అలహాబాద్ హైకోర్టు పేర్కొన్నది. ఇలాంటి సందర్భంలో ఆమె మృతికి భర్త, అత్తింటి వారి ప్రత్యక్ష ప్రమేయం ఉందనడానికి ఎలాంటి సాక్ష్యాలు అవసరంలేదని స్పష్టంచేసింది.