గాంధీ దవాఖానలో చర్లపల్లి ఖైదీ మృతి
సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో(Gandhi Hospital) చికిత్స పొందుతూ చర్లపల్లి జైలు ఖైదీ మృతి చెందాడు. సోన్న అడెల్లు అనే ఖైదీ లైంగిక దాడి కేసులో పదేళ్ల శిక్ష అనుభవిస్తున్న అతను అనారోగ్యంతో బాధపడుతుండగా జైలు సిబ్బంది అతడిని చికిత్స కోసం గాంధీ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ అడెల్లు మృతి చెందాడని వైద్యులు తెలిపారు.