20 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన విమానం - సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం
హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. దిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరిన ఇండిగో (6e717) విమానానికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ల్యాండింగ్కు క్లియరెన్స్ రాలేదు. దాంతో ల్యాండింగ్ అవుతున్న సమయంలో విమానాన్ని పైలట్ తిరిగి టేకాఫ్ చేశాడు. 20 నిమిషాల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. బుధవారం రాత్రి 8:35 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. విమానంలో సీఎం రేవంత్ రెడ్డి సహా 229 మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతరం విమానం సేఫ్గా ల్యాండింగ్ అవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 3 రోజులు దిల్లీలో...