కారుతో బీభత్సం సృష్టించిన మైనర్..

బోరబండ ప్రాంతం కార్మికనగర్‌లో కారుతో ఓ మైనర్‌ బీభత్సం సృష్టించాడు. ప్రమాదకరంగా వాహనం నడిపి ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చాడు. వరుసగా ఏడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టి విధ్వంసం చేశాడు. అలీ అహ్మద్ ఖాన్ (17) ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం కార్మికనగర్ ప్రాంతానికి కారులో వచ్చాడు. ఒక్కసారిగా వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. అదే సమయంలో అటుగా వస్తున్న సోదరులు రాజ్‌కుమార్ (60), ప్రభాకర్ (55) ప్రమాదాన్ని గమనించి తమ బైక్‌ను రోడ్డుపక్కకు తీసుకెళ్లారు.అయితే, వారివైపే దూసుకొచ్చిన కారు ఏకంగా ఏడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టడంతో పాటు అన్నదమ్ములపైకీ దూసుకెళ్లింది. కారు ఢీకొనడంతో ఇద్దరిలో ఒకరు స్వల్పగాయాలతో బయటపడగా.. మరొకరు దూరంగా ఎగిరిపడ్డారు. అనంతరం అతని పైనుంచి కారు వెళ్లగా.....