బీఆర్ఎస్లోకి సిపిఐ నాయకుడు మారుతి కిరణ్
ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు గ్రామానికి చెందిన సిపిఐ నాయకుడు మారుతి నరేష్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బుధవారం బీఆర్ఎస్ నేత, హర్షిని డెవలపర్స్ అధినేత అల్లిక వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అల్లిక వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. అధికారంలో ఉన్న, లేకపోయినా నిరంతరం ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తున్న పార్టీ కాబట్టి రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఇంత ఆదరణ ఉందన్నారు. బడుగు బలహీన వర్గాలకు గులాబీ జెండా ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు.