నా తండ్రి హ‌త్య కేసులో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయి..

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 75వ జయంతి సందర్భంగా పులివెందులలో ఆయన సమాధి వద్ద కుమార్తె వైఎస్ సునీతారెడ్డి, కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సునీతా రెడ్డి.. వివేకా హత్య కేసు విచారణ, ఇటీవలి తీర్పులు సరిగా లేవని ఆరోపిస్తూ మరోసారి సంచలన వ్యాఖ్యలుచేశారు. విచారణ సరిగా జరగకపోవడంవల్లే తాము పదేపదే కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.