ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈరోజు (శనివారం) నోటిఫికేషన్ విడుదల చేశారు. 17వ తేదీ ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయని నోటిఫికేషన్‌లో గవర్నర్ పేర్కొన్నారు. 17వ తేదీ ఉదయం 10 గంటలకు ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. 17వ తేదీ ఉదయం అసెంబ్లీ బీఏసీ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలి, అజెండాపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.