పట్టపగలే మట్టి దందా.. యంత్రాలతో యథేచ్ఛగా తవ్వకాలు..

మాగనూరు, ఆగస్టు 11: మహబూబ్‌నగర్ జిల్లా మాగనూరు మండల పరిధిలోని నల్లగట్టు శివారులో పట్టపగలే భారీ యంత్రాలతో మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎక్స్‌కవేటర్లతో మట్టిని తవ్వి టిప్పర్లలో తరలిస్తున్న దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మట్టి తవ్వకాలకు సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకున్నారా? తవ్విన మట్టిని తరలించేందుకు రవాణా అనుమతులు ఉన్నాయా? అనే అంశాలను అధికారులు పరిశీలించాల్సి ఉందని స్థానికులు కోరుతున్నారు. మైనర్‌ మినరల్స్‌ తవ్వకం, రవాణా, అక్రమ క్వారీయింగ్‌ను అరికట్టాల్సిన బాధ్యత మైనింగ్‌ శాఖపై ఉందని వారు గుర్తుచేస్తున్నారు. అధికారుల కనుసన్నల్లోనే దందా? గత కొన్ని...