భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్

స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. కేవలం 18 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం ఖుదీరామ్ బోస్ ప్రాణత్యాగం చేశారన్నారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా భయంలేకుండా పోరాడిన వీరుడు ఖుదీరామ్ బోస్‌ అంటూ కొనియాడారు. ఆయన ధైర్యం, దేశభక్తి.. యువతకు నేటికీ ఆదర్శమని వ్యాఖ్యానించారు.