ఆపరేషన్ సిందూర్‌లో అమరులైంది వీరే..

ఆపరేషన్ సిందూర్‌ సమయంలో దేశ రక్షణ కోసం అత్యున్నత త్యాగం చేసిన ఆరుగురు సైనికుల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది పాకిస్థాన్‌పై చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో మనదేశం కొందరు వీర జవాన్లను కోల్పోయింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఐదుగురు ఆర్మీ అధికారులతో పాటు ఓ అగ్నివీర్ వీరమరణం పొందారు. వారి పేర్లను నేషనల్ వార్ మెమోరియల్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ప్రాణాలు కోల్పోయిన వీరుల పేర్లను న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకంలో ప్రత్యేక గ్రానైట్ శిలలపై చెక్కనున్నారు. వీరిలో ఇద్దరికి ఇప్పటికే అత్యున్నత శౌర్య పురస్కారాలు కూడా లభించాయి (National War Memorial). ఈ ఆరుగురు అమరవీరుల్లో రైఫిల్‌మన్...