Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

జైల్‌ భరోను జయప్రదం చేద్దాం

Author Neti Sudiksha | 08 Aug 2026, 08:58 PM | హైదరాబాద్
జైల్‌ భరోను జయప్రదం చేద్దాం

​క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న నిర్వహించే జైల్‌భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ అంబర్‌పేట జోన్‌ పరిధిలోని కోరంటి చౌరస్తా వద్ద శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నయా ఉదారవాద సంస్కరణలను దూకుడుగా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం లేబర్‌ కోడ్‌ల ద్వారా కార్మిక హక్కులను హరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చేలా ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ పేరుతో పని గంటలను పెంచుకునేందుకు యాజమాన్యాలకు వెసులుబాటు కల్పిస్తోందన్నారు. సమ్మె హక్కును, కార్మిక సంఘాల గుర్తింపు, రిజిస్ట్రేషన్‌ను కష్టతరం చేస్తూ ఉద్యోగ భద్రతకు ముప్పు తెస్తోందని విమర్శించారు. 300 మంది లోపు కార్మికులు పనిచేసే సంస్థల్లో ముందస్తు నోటీసు లేకుండా ఉద్యోగుల తొలగింపునకు అవకాశం కల్పించే ‘హైర్‌ అండ్‌ ఫైర్‌’ విధానాన్ని తీసుకొచ్చారని తెలిపారు. వేతనాల కోడ్‌, సామాజిక భద్రతా కోడ్‌, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులకు సంబంధించిన నిబంధనలతో భవన నిర్మాణ, హమాలీ, రవాణా, బీడీ తదితర అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. లేబర్‌ కోడ్‌లు అమలైతే తరతరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను కార్మికులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.