Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

చరిత్రలోనే అరుదైన దృశ్యం

Author Neti Sudiksha | 27 Jun 2026, 10:58 PM | హైదరాబాద్
చరిత్రలోనే అరుదైన దృశ్యం

సీషెల్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అత్యంత అరుదైన ఆసక్తికరమైన భేటీలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవిగా గుర్తింపు పొందిన 'జొనాథన్‌' అనే భారీ తాబేలును ప్రధాని మోదీ ప్రత్యేకంగా కలిశారు. దాదాపు 194 ఏళ్ల వయస్సున్న ఈ అద్భుత జీవికి ప్రధాని స్వయంగా ఆహారం తినిపించారు. జొనాథన్‌తో గడిపిన ఆ క్షణాలు పర్యావరణ పరిరక్షణ, ప్రకృతిపై ప్రధానికి ఉన్న మమకారాన్ని చాటిచెప్పాయి. 1832లో జన్మించినట్లు భావిస్తున్న జొనాథన్‌, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం భూమిపై జీవిస్తున్న అత్యంత వృద్ధ జంతువు. ప్రధాని మోదీ సీషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్స్‌ను సందర్శించిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఆయన మొక్కలు నాటి, పర్యావరణ హిత సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా జొనాథన్‌తో ఆయన గడిపిన సమయం పర్యాటక రంగంలోనూ, జీవ వైవిధ్య సంరక్షణలోనూ ఈ పర్యటనకు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. మరిన్ని కనుగొనండి Sports సీషెల్స్ స్వాతంత్ర్య దినోత్సవం, భారత్-సీషెల్స్ మధ్య దౌత్య బంధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం శనివారం విక్టోరియా చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధానికి అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, సీషెల్స్‌ను భారత్ ఒక 'విలువైన సముద్ర భాగస్వామి'గా, నమ్మకమైన మిత్రదేశంగా పరిగణిస్తుందని పేర్కొన్నారు. Also Read 194 ఏళ్ల తాబేలును కలవబోతున్న ప్రధాని మోదీ! ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవి ఈ పర్యటనలో భాగంగా అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీతో ప్రధాని ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నారు. సముద్ర భద్రత, బ్లూ ఎకానమీ, వాతావరణ మార్పుల సవాళ్లు, అభివృద్ధి సహకారం మరియు వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై ఇద్దరు నేతలు సమగ్రంగా సమీక్షించనున్నారు.